Saturday, June 30, 2012


శ్రీకాకుళం జిల్లా చిలకసాలెంలో పేలుడు

  • నాగార్జున ఆగ్రో కెమికల్‌ కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు
  • ముగ్గురు చనిపోయినట్లు అనుమానం ?
  • 40 మందికి గాయాలు
  • చిలకపాలెంలో నాగార్జున అగ్రిఫార్మాలో పేలిన బాయిలర్‌
  • చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
  • మంటలు అదుపు చేస్తున్న ఫైర్‌ సిబ్బంది
  • 40 మంది కార్మికులు రిమ్స్‌కు తరలింపు
  • ముడు, నాలుగు బ్లాకులకు విస్తరించిన మంటలు
  • భయంతో పరుగులు తీసిన కార్మికులు
  • మంటలు అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది
  • క్షతగాత్రులు రిమ్స్‌కు తరలింపు
  • ఫ్యాక్టరీని చుట్టుముట్టిన పొగ
  • పేలిన రియాక్టర్‌, ఐదుగురు కార్మికుల మృతి
  • లోపల మరికొంత మంది కార్మికులు?
  • 10 కి.మీ మేర గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
  • పొగపీల్చడం హానికరమంటున్న యాజమాన్యం
  • ఎగిసిపడుతున్న మంటలు, కమ్ముకున్న దట్టమైన పొగ
  • ఐదో బ్లాక్‌ నుంచి మిగతా బ్లాకులకు విస్తరిస్తున్న మంటలు
  • మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న రెండు ఫైరింజన్లు
  • భయాందోళనలో స్థానికులు
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం
  • పేలుడు ఘటనపై నివేదిక కోరిన సీఎం
  • సహాయక  చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు
  • పేలడానికి సిద్దంగా ఉన్న మరో రియాక్టర్‌ ?
  • ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరు డిస్సీలు, పోలీసు బలగాలు
శ్రీకాకుళంలో భారీ పేలుడు సంభవించింది. చిలుకపాలెం నాగార్జున అగ్రికెమ్‌  కంపెనీలో రియాక్టర్‌ పేలింది. దీంతో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.  ఇదిలా ఘటన జరిగిన సమయంలో 200 మంది వరకు కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం. మరికొందరు లోపలే చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఐదో బ్లాక్‌లో జరిగిన ఈ ప్రమాదంతో మిగిలిన బ్లాకులకు మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు  ప్రయత్నిస్తున్నాయ్‌. ఇతర ప్రాంతాల నుంచి ఫైరింజన్లను చిలుకపాలెంకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, 17 మంది గాయపడ్డారని చెప్పారు.

నాగార్జున అగ్రికెమ్‌ ఫ్యాక్టరీలో పేలుడుతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. ఇంతలోనే పొగ మొత్తం చుట్టుముట్టడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు. లోన చిక్కుకున్నవారు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని రియాక్టర్లకు మంటలంటుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అక్కడినుంచి తరలిస్తున్నారు. ఎవ్వరినీ ఫ్యాక్టరీ పరిసరాలకు అనుమతించడం లేదు.

నాగార్జున అగ్రికెమ్‌ పేలుడుతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. లోపల ఏంజరుగుతుందో తెలియక కార్మికులు కలవరపడుతున్నారు. లోపల ఎంత మంది ఉన్నారో తెలియక ఆందోళన చెందుతున్నారు. వారిని రక్షించాలంటూ అగ్నిమాపక సిబ్బందిని వేడుకుంటున్నారు. తమవారి జాడ కోసం కార్మికుల బంధువులు రోధిస్తున్నారు. ఇదిలా ఉంటే గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

No comments:

Post a Comment